చెన్నై, మార్చ్ 05: మంగళవారం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్కు 10 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే పొత్తులో భాగంగా పుదుచ్చేరితో కలిపి కాంగ్రెస్ పార్టీ 10 సీట్లలో పోటీ చేస్తుందని, ఇతర భాగస్వామ్య పార్టీలే మరో 10 సీట్లలో పోటీ చేస్తాయని చెప్పారు. డిఎంకే తక్కిన 20 సీట్లలో పోటీ చేస్తుందన్నారు. డిఎంకే, భాగ్యస్వామ్య పార్టీలు ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే విషయమై మార్చి 7న సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలుండగా, పుదుచ్చేరిలో ఒక లోక్సభ స్థానం ఉంది.