పాస్‌పోర్ట్ ఇస్తేనే భారతీయుడిగా గర్విస్తా : గాలిబ్ గురు

SMTV Desk 2019-03-05 16:48:18  afzal guru, galib guru, 2001 parliament attack, accused afzal guru

న్యూఢిల్లీ, మార్చ్ 5: 2001లో పార్లమెంట్‌ పై దాడిలో ప్రధాన సూత్రధారి అయిన అఫ్జల్‌ గరు కొడుకు గాలిబ్ గురుకు కేంద్రం ఆధార్ కార్డ్ ఇచ్చింది. ఈ సందర్భంగా గాలిబ్ గురు మాట్లాడుతూ...తనకు ఈ గుర్తింపు కార్డు రావడం చాలా సంతోషంగా ఉందని అయితే పాస్‌పోర్ట్‌ కూడా ఇప్పిస్తే విదేశాలకు వెళ్లి చదువుకుంటానని గాలిబ్‌ చెబుతున్నాడు. కాగా తనకు ఇప్పటికే ఇటలీ నుంచి స్కాలర్‌షిప్ ఆఫర్ కూడా వచ్చిందని అన్నాడు. తనకు పాస్‌పోర్ట్ కూడా దక్కితే ఓ భారతీయ పౌరుడిగా తాను చాలా గర్విస్తానని గాలిబ్ చెప్పాడు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించిన ఓ పత్రికపైనా గాలిబ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు పాస్‌పోర్ట్ ఇస్తేనే భారతీయుడిగా గర్విస్తానని సదరు పత్రిక రాసిందని, తన ఉద్దేశం మాత్రం అది కాదని అతను అన్నాడు. ఇక తన తండ్రి అఫ్జల్ గురుని ప్రభుత్వం 2013లో ఉరి తీసింది.