నాగపూర్, మార్చ్ 5: ఆసిస్ తో జరుతున్న రెండు సిరీస్ లో భాగంగా నేడు రెండో సిరీస్(వన్డే)లో రెండో వన్డే నాగ్పూర్లోని విదర్భ వేదికగా జరుగుతోంది. కాగా ఈ మ్యాచ్ లో ఆసిస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకుంది. మొదటి వన్డేలో కూడా టాస్ గెలిచిన ఆసిస్ బ్యాటింగ్ ఎంచుకుంది కాని ఊహించని విధంగా పరాజయ పాలైంది. తొలి వన్డే విజయాన్ని కొనసాగించాలనే క్రమంలో కోహ్లీ సేనా తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది. ఆస్ట్రేలియా జట్టులోనూ ప్రధాన మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. ఇక మొదటి సిరీస్(టీ20)ను టీం ఇండియా కోల్పోయిన సంగతి తెలిసిందే.
టీమిండియా:
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, కేదర్ జాదవ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, బుమ్రా
ఆస్ట్రేలియా:
ఖవాజా, ఫించ్, స్టోనిస్, హ్యాండ్స్కాంబ్, మ్యాక్స్వెల్, షాన్ మార్ష్, అలెక్స్ క్యారీ, కౌంటర్ నైల్, పాట్ కమిన్స్, ఆడం జంపా, లైన్