చెన్నై, మార్చి 05: సెలెబ్రిటీలకు ఒక్కోసారి అభిమానుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతాయి. కొంతమంది మితిమీరిన అభిమానంతో సెలెబ్రిటిలను ఇబ్బందికి గురి చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే తమిళ హీరో కార్తీకి ఎదురైంది. కానీ కార్తీని ఇబ్బంది పెట్టింది అభిమాని కాదు, సినీ నటి కస్తూరి. నిన్న చెన్నైలో జరిగిన జులై కాట్రిల్ అనే తమిళ సినిమా ఆడియో లాంచ్ వేడుకకు కస్తూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి కార్తీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కస్తూరి.. కార్తిని సెల్ఫీ కావాలని అడుగుతూ పరోక్షంగా ఆయన తండ్రి శివకుమార్ను టార్గెట్ చేసినట్లు మాట్లాడారు.. "మీ నాన్న లేరు కదా.. రండి ఓ సెల్ఫీ దిగుదాం" అని కార్తితో వ్యంగ్యంగా అన్నారు. ఇందుకుకార్తీకి కోపం వచ్చి, సేల్ఫీ దిగడానికి నిరాకరించాడు. వెంటనే కార్తీ నేరుగా స్టేజ్పై ఉన్న మైక్ స్టాండ్ వద్దకు వెళ్లి.. "అనుమతి లేకుండా ఓ సెలబ్రిటీతో సెల్ఫీలు దిగేస్తే ఎంత అమర్యాదకరంగా ఉంటుందో కొంతమందికి తెలీదు. ఫోన్ నుంచి వెలువడే ఫ్లాష్లైట్ వల్ల మైగ్రేన్ సమస్య ఉన్నవారికి చాలా ఇబ్బందులు కలుగుతాయి" అని చెప్పి అక్కడి నుండి వెళ్లి పోయాడు.