ముంబై, మార్చి 05: ప్రస్తుతం బయోపిక్స్ కి క్రేజ్ని దృష్టిలో ఉంచుకొని దర్శక నిర్మాతలు ఎక్కువశాతం జీవిత కథలను సినిమాగా తీయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో బయోపిక్లు రిలీజ్ అయ్యాయి. కాగా, కొన్ని షూటింగ్ దశలోనూ, మరికొన్ని చర్చల దశలోనూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో బయోపిక్ ని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా హిమాలయాలను అధిరోహించిన అరుణిమా సిన్హా జీవితాన్ని సిల్వర్ స్కీన్పై చూపించడానికి సిద్ధమయ్యారు. అరుణిమ పాత్రను ఆలియా భట్ పోషించనున్నారని బాలీవుడ్ టాక్. అరుణిమా సిన్హా వాలీబాల్ ప్లేయర్. ఓసారి బందిపోటు దొంగల బారినపడి, వాళ్లు ట్రైన్లో నుంచి తోసేయడంతో ఆమె ఒక కాలును పోగొట్టుకున్నారు. అయినా ఆమె నిరాశపడకుండా హిమాలయాలను అధిరోహించడానికి శిక్షణ పొంది, 2012లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు.ఎవరెస్ట్ ను అధిరోహించిన ఫస్ట్ ఫిజికల్లీ చాలెంజ్డ్ ఉమన్గా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె జీవితం ఆధారంగా తీయబోతున్న చిత్రం 2020లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ముందుగా కంగనా రనౌత్ని హీరోయిన్ గా అనుకున్నారట. ఇప్పుడు ఆమె ప్లేస్లోకి ఆలియా భట్ వచ్చింది.