మెగాస్టార్ తో కల్వకుంట్ల కవిత

SMTV Desk 2017-08-05 19:00:49  CHIRANJEEVI, KAVITHA SELFEE

హైదరాబాద్, ఆగస్ట్ 5 : మెగాస్టార్ చిరంజీవితో టీఆర్ఎస్ ఎంపీ కవిత ఓ సెల్ఫీ దిగారు. ఈరోజు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఢిల్లీ వెళ్ళిన ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కుశల ప్రశ్నల అనంతరం చిరుతో కవిత సరదాగా ఒక సెల్ఫీ దిగారు. ఈ ఫోటోను ఆమె తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కవిత ట్విట్టర్ ద్వారా పంచుకున్న మరో ఫోటోలో చిరంజీవి, టీడీపీ ఎంపీ మాగంటి బాబు కూడా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీలు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్న అనంతరం మాట్లాడుతూ... తమ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యనాయుడు గారికి ఓటు వేశామని, ఆయన గెలుపు తథ్యమని అన్నారు.