కాంగ్రెస్ తో ఆప్ జోడి.....?

SMTV Desk 2019-03-05 13:10:35  Arvind Kejriwal, Rahul Gandhi, Alliance, AAP, Congress, BJP, Lok Sabha Polls

న్యూఢిల్లీ, మార్చి 5: కాంగ్రెస్ పార్టీ మరో పార్టీని పోత్తుల్లోకి ఆహ్వానించేందుకు సిద్దంగా ఉంది. ఢిల్లీలో కీలకమైన ఆమ్ ఆద్మీ పార్టీని కూటమిలో చేర్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మధ్యాహం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఈ భేటి లో ఆప్ తో పొత్తుపై చర్చించనున్నారు. కాగా, కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో ఈ నెల ప్రారంభంలో ఆరు స్థానాలకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తమ అభ్యర్థులను ప్రకటించారు. తమతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని ఆ సందర్భంగా కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాంగ్రెస్ కు రెండు స్థానాలు ఇచ్చేందుకు ఆప్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కానీ కాంగ్రెస్ మూడు సీట్లు కోరుతున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో మొత్తం 7 లోక్ సభ స్థానాలు ఉండగా 2014 ఎన్నికల్లో ఆ ఏడూ సీట్లను బీజేపీ సంపాదించుకుంది. కాగా, 2015లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీలోని 70 స్థానాల్లో 67 స్థానాల్లో ఆప్ జయకేతం ఎగురవేసింది.