ఉగ్రవాదులకు మోదీ హెచ్చరిక

SMTV Desk 2019-03-05 12:52:49  Modi, Terrorist, Surgical strike

న్యూడిల్లీ, మార్చి 05: భారత ప్రభుత్వం తరపున ఉగ్రవాదులకు ప్రధాని మోదీ మరో హెచ్చరిక జారీ చేసాడు. నిన్న అహ్మద్ నగర్ లో జరిగిన సభలో మోదీ ప్రసంగిస్తూ.. ఇటీవల జరిపిన సర్జికల్ స్ట్రైక్ కేవలం ఆరంభం మాత్రమే అని, ఇంకా చేయవలసింది చాలా ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదులపై ఒకసారి దాడి చేసాం కాబట్టి పని అయిపోయిందని విశ్రాంతితీసుకుంటున్నామని భ్రమపడొద్దని, మరో దాడి తప్పదని అన్నారు. ఉగ్రవాదులు ఈ భూమి మీద ఎక్కడ దాక్కుని ఉన్నా తప్పించుకోలేరని, వారిని వేటాడతామని, ఇళ్లలోకి వెళ్లి మరీ హతమారుస్తామని సూటిగా హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశానికి జరిగిన నష్టానికి మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. 40 సంవత్సరాలుగా ఉగ్రవాదం పట్ల అనుసరించిన ఉదాసీన వైఖరి ఇక ఎంతమాత్రమూ ఉండబోదన్నారు. ఇప్పడు తామేం చేసినా ఎన్నికలకు ముడిపెడుతున్నారని, 2016లో మెరుపుదాడులు చేసినప్పుడు ఏ ఎన్నికలు లేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. తనకు పదవీ వ్యామోహం లేదని, దేశ ప్రజల భద్రతే తనకు అన్నింటికంటే ముఖ్యమని, అందుకోసం ఏమైనా చేస్తానని ప్రధాని స్పష్టం చేశారు.