పుల్వామాలో ఎన్‌కౌంటర్

SMTV Desk 2019-03-05 12:50:22  Pulwama, Terrorist, Soldiers, Attack

శ్రీనగర్, మార్చి 5: పాకిస్తాన్ మరోసారి తన నిజ స్వరూపం చూపిస్తుంది. మంగళవారం ఉదయం భారత సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్లు జరిగాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటిపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో గంటకు పైగా కాల్పులు జరిగాయని, ఉగ్రవాది తలదాచుకున్న గృహాన్ని భద్రతాదళాలు పేల్చివేశాయని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని ఓ ఇంటిలో ఇద్దరు ఉగ్రవాదులు నక్కినట్లు అందిన సమాచారంతో భద్రతా దళాలు మంగళవారం తెల్లవారుజామున ఇంటిని చుట్టుముట్టాయి. భద్రతా దళాల దాడిలో ఓ ఉగ్రవాది మరణించగా మరో టెర్రరిస్ట్‌ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం కాల్పులు నిలిచిపోయాయని, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారని అధికారులు తెలిపారు.