మరదలి పై అత్యాచారం .. గర్భం దాల్చిన మైనర్ బాలిక

SMTV Desk 2019-03-05 12:48:50  Kalyan durgam Andhra pradesh

ఆంధ్రప్రదేశ్, మార్చి 05: అత్యాచారానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని మగ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే... కళ్యాణదుర్గానికి చెందిన బాలిక అనంతపురంలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుకుంటోంది. అయితే అప్పుడప్పుడు అదే పట్టణంలో ఉంటున్న తన అక్కాబావల ఇంటికి వెళ్తుండేది. ఈ క్రమంలో బావ కన్ను మరదలిపై పడింది. ఆమెను బలవంతంగా లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భవతి అయింది. ఇటీవల బాలిక తనకు ఆరోగ్యం బాగాలేదని స్వగ్రామానికి వచ్చింది. ఆదివారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతపురంలోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే బాలిక మగ శిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు