శివాలయంలో మెగా పవర్ స్టార్ దంపతుల పూజలు

SMTV Desk 2019-03-05 12:32:01  Ram Charan, Upasana, Kamareddy, Domakonda

కామారెడ్డి, మార్చి 05: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మహా శివరాత్రి సందర్భంగా దోమకొండ శివాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. రామ్ చరణ్ సాంప్రదాయ వస్త్రాలను ధరించి శివలింగానికి అభిషేకం చేసి పూజలు చేసాడు. ఈ వీడియోను ఉపాసన తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకుంది. కామారెడ్డి జిల్లలో ఉన్న దోమకొండ శివాలయానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. సుమారు 800 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో దీని నిర్మించారు. అయితే దోమకొండ కోటను 400 ఏళ్ల క్రితం తమ పూర్వీకులే కట్టించారని ఉపాసన పేర్కొంది.