పాక్కు ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా దాని బుద్ది మారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 11.30 గంటలకు రాజస్థా న్లోని బికనీర్లోని నాల్ సెక్టార్ వద్ద ఒక డ్రోన్ ఎగురుతుండటాన్ని వాయుసేన రాడార్స్ గుర్తించి అప్రమత్తం చేయగానే వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ధవిమానం దానిని కూల్చివేసింది. అది పాక్ సరిహద్దులో కూలిపోవడంతో దాని వివరాలు తెలియలేదు. అయితే తాము అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదని భారత్ వాయుసేన కూల్చిన డ్రోన్తో తమకు ఎటువంటి సంబందమూ లేదని పాక్ స్పష్టం చేసింది.
అంతర్జాతీయ ఒత్తిళ్ళ కారణంగా పాక్ సైన్యాధికారుల చేతులు కట్టేసినట్లవడంతో ఏమీ చేయలేక ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని చెప్పవచ్చు.