వరంగల్, మార్చ్ 04: ప్రేమోన్మాదానికి డిగ్రీ విద్యార్థిని రవళి బలయ్యింది అని మనకు తెలిసిందే .అయితే తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఫిబ్రవరి 27 హన్మకొండలోని నయీంనగర్ లో రవళిపై సాయి అన్వేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పింటించాడు. 70 శాతం కాలిన గాయాలతో యశోధ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూసింది. రవళి స్వస్థలం వరంగల్ జిల్లాలోని సంగెం.తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో రవళిపై పగ పెంచుకున్న అన్వేష్.. ఆమె కాలేజీ నుంచి స్నేహితురాలి హాస్టల్కి వెళుతుండగా నడిరోడ్డుపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. తొలుత ఆమెకు వరంగల్లో చికిత్స అందించిన వైద్యులు.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. వారం రోజులుగా రవళి హైదరాబాద్లో చికిత్స పొందుతోంది. అన్వేష్ను ఉరి తీయాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.