శ్రీశైల క్షేత్రం.. భక్తులతో కిటకిట

SMTV Desk 2019-03-05 11:44:11  Srishailam, Devotees, Rush, Temple, Shiva Ratri

అమరావతి, మార్చి 4: నేడు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లన్న దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం గజ ఈతగాళ్లు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీతో సాక్షి గణపతి, హఠకేశ్వరం, పాలధార పంచదార, శిఖరేశ్వరం ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గజవాహనంపై భ్రమరాంబ మల్లికార్జునస్వామి గ్రామోత్సవం నిర్వహించారు. కాగా, భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని సమాచారం. అలాగే భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు.