భారత స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన రికార్డును సాధించాడు. 2019లో భీకర ఫామ్లో ఉన్న మహి, శనివారం ఉప్పల్లో జరిగిన వన్టేలో అర్థశతకం బాది భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో చేసిన పరుగులతో లిస్ట్ ఎ- క్రికెట్లో 13000 పరుగులు సాధించిన నాలుగో భారత్ క్రికెటర్గా ధోని చరిత్రలోకి ఎక్కాడు . సచిన్, గంగూలీ, ద్రవిడ్ తరువాత ఈ మైలురాయిని దాటిన భారత క్రికెటర్ ధోనీయే. మిస్టర్ ఫినిషేర్ 412 లిస్ట్ ఎ మ్యాచ్ల్లో ఇప్పటివరకు మొత్తం 13,054 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ గ్రాహమ్ గూచ్ 50.79 సగటుతో 22,211 పరుగులు సాధించి ఈ జాబితాలో మొట్ట మొదటి వరుసలో ఉన్నాడు. మరిన్ని రికార్డ్స్ ని తిరగరాయాలని ఆశిద్దాం .. మంగళవారం భారత్ - ఆస్ట్రేలియా రెండవ వన్ డె జరుగుతుంది .. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి భారత్ 2-0 లీడ్ చేయాలనీ భావిస్తుంది .. విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో చేసిన పరుగులతో లిస్ట్ ఎ- క్రికెట్లో 13000 పరుగులు సాధించిన నాలుగో భారత్ క్రికెటర్గా ధోని చరిత్రలోకి ఎక్కాడు . సచిన్, గంగూలీ, ద్రవిడ్ తరువాత ఈ మైలురాయిని దాటిన భారత క్రికెటర్ ధోనీయే. మిస్టర్ ఫినిషేర్ 412 లిస్ట్ ఎ మ్యాచ్ల్లో ఇప్పటివరకు మొత్తం 13,054 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ గ్రాహమ్ గూచ్ 50.79 సగటుతో 22,211 పరుగులు సాధించి ఈ జాబితాలో మొట్ట మొదటి వరుసలో ఉన్నాడు. మరిన్ని రికార్డ్స్ ని తిరగరాయాలని ఆశిద్దాం .. మంగళవారం భారత్ - ఆస్ట్రేలియా రెండవ వన్ డె జరుగుతుంది .. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి భారత్ 2-0 లీడ్ చేయాలనీ భావిస్తుంది ..