న్యూఢిల్లీ, మార్చి 4: పాకిస్తాన్ సైన్యానికి చిక్కి ధైర్యంతో ముందుకెళ్లిన భారత పైలట్ అభినందన్ టాపిక్ దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజకీయ నాయకులూ అభినందన్ ఎపిసోడ్ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమలో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడవి భారీ విమర్శలకు దారి తీస్తున్నాయి. అభినందన్ యూపీఏ హయాంలోనే పైలట్గా ఎదిగాడని సల్మాన్ ఖుర్షీద్ చేసిన ట్వీట్పై నెటిజన్ల నుండి ఆయన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు.
అభినందన్ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని మండిపడుతున్నారు. మరికొందరు 1983లో వింగ్ కమాండర్ అభినందన్ జన్మించారని, ఇందుకు ఇందిరా గాంధీకి క్రెడిట్ ఇవ్వాలా అంటూ ఎద్దేవా చేశారు. ఖుర్షీద్కు నోబెల్ శాంతి బహుమతి వచ్చేలా చూడలంటూ కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. కాగా, అభినందన్ శత్రుదేశంలో చూపిన సంయమనం, ధైర్యసాహసాలపై దేశవ్యాప్తంగా ఆయనకు ప్రజలు నీరాజనాలు పట్టిన సంగతి తెలిసిందే.