హైదరాబాద్, ఆగస్ట్ 5 : ఒకప్పుడు రాజకీయ నాయకుల అభిమానులైనా, సినీనటుల అభిమానులైనా తమ అభిమాన నేత లేదా హీరో ఏదైనా చెబితే దానిని జవదాటే వారు కాదు. ఇప్పుడు అలాంటి అభిమానులు లేరని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఎంత వద్దని వారిస్తున్నా అభిమానులు ఆయనపై పడి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అసలు అలాంటి అభిమానులు ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటూ ఆయన మండిపడ్డారు. వారికి వారి అభిమాన నేతలంటే గౌరవం లేదంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాలలోకి వచ్చిన నటులంతా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళడం వల్లనే నిజమైన హీరోలుగా మారారు. పవన్ మొదటి నుంచి భద్రతతోనే బయటకు వెళ్ళారని, ఇప్పుడు కూడా ఆయన భద్రత లేకుండా వెళ్ళరనే తానూ అనుకుంటున్నాని తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు.