న్యూఢిల్లీ, మార్చ్ 3: బడ్జెట్ ఎయిర్లైన్స్ సంస్థ గో ఎయిర్ విమాన టికెట్ల ధరలను తగ్గించాయి. జాతీయ, అంతర్జాతీయ చార్జీలు కలుపుకుని దేశీయ రూట్లలోరూ.1099, అంతర్జాతీయంగా రూ.4999 ప్రారంభ ధరలుగా ఆఫర్ చేస్తోంది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్గా తీసుకొచ్చిన అవకాశం ఈ నెల నాలుగో తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అని ప్రకటించింది. అలాగే బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు ప్రయాణించవచ్చు. పూర్తి వివరాలను గో ఎయిర్ వెబ్సైట్లో పొందుపర్చింది. కాగా ఒక పక్క భారీగా పెరిగి విమాన ఇంధన ధరలు, మరో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ధరల సంస్థ తక్కువ ధరల్లో టికెట్లను ఆఫర్ చేయడం గమనార్హం. మరోవైపు గో ఎయిర్ ప్రత్యర్థి సంస్థ స్పైస్ జెట్ సంస్థ ఉడాన్ సేవలందించనున్నది. దీని ప్రకారం అన్ని ఫీజులు కలిపి టిక్కెట్ ధర రూ.2,293గా నమోదైంది. రీజినల్ కనెక్టివిటీ స్కామ్ - ఉడాన్ పథకాన్ని ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 15 వరకు పది నూతన ప్లయిట్లలో అమలు చేయనున్నది.