ఇస్లామాబాద్, మార్చ్ 3: జైషే మొహమ్మద్ సంస్థ అధినేత మసూద్ అజార్ కొద్ది సేపటి క్రితం మృతిచెందినట్లు పాకిస్తాన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో భాదపడుతూ రావల్పిండి సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా ఆయన ఆరోగ్యం విషయమించి అతను మృతిచెందారని పాక్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఈ నెల 2 వ తేదీనే చనిపోయారని వారు చెబుతున్నారు.