హైదరాబాద్, మార్చ్ 3: ఆదివారం రోజు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. టీఆర్ ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేసేందుకు సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ ఆకర్ష్ పై కాంగ్రెస్ కన్నెర్రజేస్తోంది.