హైదరాబాద్ వన్డే: ధోని, జాదవ్ ల మ్యాజిక్

SMTV Desk 2019-03-03 14:39:50  Hyderabad, ODI, dhoni,

హైదరాబాద్ లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్రతీకారం తెరుచుకుంది టీమిండియా. 237 పరుగులు ఛేదించే లక్ష్యంతో బరిలో దిగిన ఇండియా 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ కేదార్ జాదవ్ 81, ధోనీ 59 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినప్పటికీ జాదవ్, ధోనీల మెరుపు వేగం 100పరుగుల భాగస్వామ్యం సాధించటమే కాకుండా జట్టును విజయ తీరాలకు చేర్చింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 50ఓవర్లు ఆడి 7 వికెట్లకు 236 పరుగులే చేసింది. ఓపెనర్ ఖవాజా 50, స్టోయినిస్ 37, మ్యాక్స్ వెల్ 40 పరుగులు సాధించారు. వికెట్ కీపర్ క్యారీ 36 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లతో ఆసీస్ ను కట్టడి చేశారు. ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా భారత్ ఐదు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి మ్యాచ్ మార్చి 5న నాగ్ పూర్ లో జరగనుం