ఢిల్లీలో ఆప్ ఒంటరి పోరు.. లోక్‌సభ అభ్యర్థుల్ని ప్రకటించిన ఆప్

SMTV Desk 2019-03-02 17:01:25  App, arvind kejrival.

న్యూఢిల్లీ, మార్చ్ 02: ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే లోక్ సభ ఎన్నికలకు ముస్తాబు అయ్యింది. అయితే మహాకూటమితో సంబంధం లేకుండా ఢిల్లీలో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండే అవకాశం ఉంది అని ప్రకటించారు. కానీ ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండే అవకాశం లేదని ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీనిపై మరింత క్లారిటీ ఇస్తూ ఇవాళ ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో తూర్పు ఢిల్లీ నుంచి అతిషిని అభ్యర్థిగా ప్రకటించారు. దక్షిణ ఢిల్లీలో రాఘవ్ చద్ధాను బరిలోకి దింపారు. చాందీని చౌక్ నుంచి పంకజ్ గుప్తాను రంగంలోకి దింపారు. ఈశాన్య ఢిల్లీలో దిలీప్ పాండ్యా పోటీలో ఉన్నారు. ఆగ్నేయ ఢిల్లీలో గుగన్ సింగ్ ను పోటీలో నిలబెట్టారు. న్యూ ఢిల్లీ నుంచి గోయల్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఏడో సీటుపైన చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ప్రకటించాల్సి ఉంది