పుల్వామాలో మరోసారి టెన్షన్ వాతావరణం

SMTV Desk 2019-03-02 16:53:44  Pulwama, Pulwama attack

పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి సంభవించింది . భారత సైనికులను టార్గెట్ చేస్తూ.. ఉగ్రవాదులు మందుపాతర పేల్చారు. ఈ ఉగ్రదాడి త్రాల్‌ వద్ద జరిగింది. ఆర్మీ కాన్వాయ్‌‌ని టార్గెట్ చేసే ఈ మందుపాతరను పెట్టినట్లు తెలిస్తోంది. మందుపాతర పెట్టేందుకు స్థానికుల సహకారం తీసుకున్నట్లు సమాచారం. ఈ పేలుడులో భారత సైనికుడు గాయపడ్డాడు. భద్రతా దళాలు వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే మరోసారి ఎక్కువ ప్రాణ నష్టం జరిగేదని అధికారులు తెలిపారు. దీంతో పుల్వామాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.