హైదరాబాద్, మార్చి 2: ఫిబ్రవరి 27 ఇంటర్ సెకండియర్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈరోజు ఇంగ్లీష్ పరీక్ష రాస్తుండగా ఓ విద్యార్థికి గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో ఆ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతి చెందిన విద్యార్థిని ఎం. గోపిరాజుగా పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లిదండ్రులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన సికింద్రాబాద్ ప్యారడైజ్లోని శ్రీచైతన్య కళాశాలలో చోటుచేసుకుంది.