హైదరాబాద్, మార్చి 02: యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమా విడుదలైన అన్ని భాషలోనూ అతి పెద్ద విజయం సాధించింది. ఒక్క హిందీలోనే ఈ చిత్రం ఏకంగా రూ.40 కోట్ల మేరకు వసూలు సాధించింది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనీ నిర్మాత విజయ్ కిరంగన్ దుర్ భావిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేసారు.
సినిమాలో ప్రధాన పాత్రలకి సంబంధించిన నటీనటుల కోసం పలువురి పేర్లని పరిశీలిస్తున్నారు. అయితే ముఖ్య పాత్రలలో రమ్యకృష్ణ, సంజయ్ దత్ని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఇక మొదటిభాగంలో చేసిన రవిశంకర్ .. అదే పాత్రలో రెండవ భాగంలోను కొనసాగుతాడట. ఈ సీక్వెల్లోఅతని పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందట. అయితే బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా ఇందులో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు సీక్వెల్లో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు.