భారత సైన్యం జరిపిన దాడిలో మేము చాలా కొలిపోయాం: పాకిస్థాన్ మంత్రి

SMTV Desk 2019-03-02 11:40:24  Malik Amin Aslam, Pakistan Minister, Forest, Damaged, Bomb Blast

ఇస్లామాబాద్, మార్చి 2: పాకిస్థాన్ మంత్రి మాలిక్ అమిన్ అస్లాం తమ దేశంలోని అటవీ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల భారత సైన్యం జరిపిన దాడిలో చెట్లు కూలిపోయి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిందన్నారు. ఈ నష్టం పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆరోపించారు. ఈ సంగతిని ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

భారత విమానాలు వేసిన బాంబుల వల్ల పైన్ చెట్లు కూలిపోయాయని, భూమిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని అస్లాం పేర్కొన్నారు. భారత్ వైమానిక దాడి చేసిన ప్రాంతానికి రాయిటర్స్ రిపోర్టర్లు వెళ్లి చూడగా అక్కడ ఈ దృశ్యం కనిపించిందని మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారం పర్యావరణానికి హాని కలిగించడం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడం కిందికే వస్తుందని మంత్రి పేర్కొన్నారు.