అమరావతి, మార్చి 2: మాజీ సీఐ, వైసీపీ నాయకుడు గోరంట్ల మాధవ్పై తాడిపత్రి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఇటీవల అనంతపురంలోని తాడిపత్రిలో ఉన్న ప్రబోధానందస్వామి ఆశ్రమం వద్ద జరిగిన గొడవల నేపథ్యంలో పోలీసులను కించపరిచేలా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలున్నాయి.
దీంతో రంగంలోకి దిగిన అప్పటి సీఐ గోరంట్ల మాధవ్, జేసీపై చెలరేగిపోయారు. మీసం మెలేస్తూ జేసీకి వార్నింగ్ ఇచ్చాడు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే నాలుక కోస్తానంటూ జేసీని హెచ్చరించారు. సీఐ చేసిన వ్యాఖ్యలపై జేసీ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓ ఎంపీపై ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని పేర్కొంటూ అతడిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో తెలిపారు. కాగా ఈ కేసును నమోదు చేసేందుకు పోలీసులు తిరస్కరించారు. దీంతో జేసీ తాడిపత్రి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన కోర్టు మాధవ్పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.