హంద్వారాలో ఎదురు కాల్పులు, ముగ్గురు ఉగ్రవాదులు హతం

SMTV Desk 2019-03-01 13:43:11  Handwara, Three Terrorist, Encountered, Soldiers

శ్రీనగర్, మార్చి 1: జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలోని బాబాగుండ్ గ్రామంలో ఈ తెల్లవారుజామున భారత సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ దాడిలో భద్రత బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. శాంతి చర్చలకు తాము సిద్ధమంటూనే, మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఈ ఘటనలో ఓ సాధారణ పౌరుడికి గాయాలయ్యాయి. ఈ ఎదురు కాల్పులతో కుప్వారా జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.