మెరుపు దాడుల వాస్తవాలను వివరించండి: దీదీ

SMTV Desk 2019-03-01 13:32:48  Mamata Banerjee, Attack, Explanation

కొలకత్తా, మార్చి 1: ప్రపంచవ్యాప్తంగా ఇండియా-పాక్ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. యావత్ భారతదేశం మొత్తం ఈ మెరుపు దాడుల గురించి కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ పచ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మాత్రం బాంబులెక్కడ వేశారు? అసలు ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారు? అంటూ ప్రశ్నిస్తున్నారు.

దీదీ మీడియాతో మాట్లాడుతూ, "సైన్యానికి మేము పూర్తి మద్దతిస్తాం. కానీ దాడులకు సంబంధించి పూర్తి వాస్తవాలను వెల్లడించండి. మెరుపు దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ అంతర్జాతీయ మీడియా వీటిని ఖండిస్తోంది. మాకు వాస్తవాలు కావాలి. మీరు సరిగ్గా టార్గెట్‌ మీదనే బాంబుల వర్షం కురిపించారా.. లేదా చెప్పండి. ఒకవేళ మీ ప్రయత్నం విఫలమైతే ఒక్కరు కూడా చనిపోరు కదా. అందుకే మెరుపు దాడులకు సంబంధించిన వాస్తవాలను బహిరంగ పర్చండి" అని కోరారు.