సిద్దిపేట, ఫిబ్రవరి 28: సిద్ధిపేట జిల్లాలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో విషాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వెళ్ళిన కాలేజి విద్యార్ధులపైకి ఓ వాహనం దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కళాశాల విద్యార్థినితో పాటు నిర్మాణ పనుల కోసం వచ్చిన ఓ కార్మికుడు మృతిచెందాడు. పూర్తి వివరాల ప్రకారం...సిద్దిపేట పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను చూస్తుండగా విద్యార్ధుల బృందంపైకి ఓ వాహనం బ్రేకులు పెయిలై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థినితో పాటు ప్రాజెక్టు పనుల కోసం వచ్చిన కార్మికుడు మృతిచెందాడు.
మరికొంతమంది విద్యార్థులకు, కార్మికులకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారందరిని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన విధ్యార్థిని నాగలక్ష్మి, కార్మికుడు అక్రమ్ ల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యయాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Rebel Time Starts 😎
— Telugu FilmNagar (@telugufilmnagar) February 28, 2019
Most Awaited #ShadesOfSaaho2 to be out in just 3 more days!
RT if you're excited! #Prabhas @ShraddhaKapoor @sujeethsign @UV_Creations @TSeries pic.twitter.com/2sRizbb3Cs
50 Days of Rajinification! Thank you for making #PETTA a mega blockbuster! @Rajinikanth @karthiksubbaraj @anirudhofficial @VijaySethuOffl @Nawazuddin_S @SimranbaggaOffc @trishtrashers @SasikumarDir @lyricist_Vivek @DOP_Tirru @SonyMusicSouth#PettaMaranaMass50Days pic.twitter.com/GQeJo9GunZ
— Sun Pictures (@sunpictures) February 28, 2019