ఉప్పల్ వన్డేకు హాట్ కేక్స్‌లా అమ్ముడైన టికెట్స్

SMTV Desk 2019-02-28 18:48:18  Uppal, Australia, India,

దేశవ్యాప్తంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు నగర పోలీసులు. మార్చి 2న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమయ్యే ఈ డే-నైట్ మ్యాచ్‌‌కు దాదాపు 2,300 మంది పోలీసులతో భద్రతా కల్పిస్తున్నామని రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరుకు 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్స్ హాట్ కేక్స్‌లా అమ్ముడయ్యాయి. కేవలం రూ.4000, రూ.6000 ఖరీదైన టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజులు ఉన్నందున ఈలోపు అవి కూడా అమ్ముడుపోతాయని హెచ్‌సీఏ అంచనా వేస్తోంది.