అమరావతి, ఫిబ్రవరి 28: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రేపు అక్కడ జరిగే ఇండియా టుడే సదస్సులో జగన్ పాల్గొననున్నారు. కాగా ఆయన వైఎస్ఆర్సిపి ప్రాంతీయ సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. అలాగే పోల్ మేనేజ్మెంట్పై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.