హైదరాబాద్, ఫిబ్రవరి 28: ఆర్ ఎక్స్ 100 సినిమాతో యూత్ లో కార్తికేయ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆయన తదుపరి సినిమా కోసం వాళ్లంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కార్తికేయ హీరోగా రెండు సినిమాలు సెట్స్ పై వున్నాయి. వాటిలో ఒక సినిమా అనిల్ కడియాల - తిరుమల రెడ్డి నిర్మాణంలో, అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతోంది.
రీసెంట్ గా ఈ సినిమా తొలి షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ ..
"తొలి షెడ్యూల్ షూటింగ్ ఒంగోలులో జరిగింది. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను 25 రోజుల పాటు అక్కడ చిత్రీకరించాము. దాదాపు 40 శాతం చిత్రీకరణను పూర్తిచేశాము .. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. తదుపరి షెడ్యూల్ ను మార్చి 5వ తేదీ నుంచి యూరప్ లోని క్రొయోషియా లో ప్లాన్ చేశాము. అక్కడ రెండు పాటలను చిత్రీకరించనున్నాము" అని చెప్పుకొచ్చాడు.