అభినందన్ ను ప్రశంశించిన పాక్ వార్తా పత్రిక...

SMTV Desk 2019-02-28 17:56:43  Indian airforce, Vardaman abhiman, Pakistan army, Indian amry, Dawn newspaper

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 28: ఎప్పుడూ భారత్ ని విమర్శిస్తూ, భారత్ కు పూర్తి వ్యతిరేఖంగా వ్యవహరిస్తూ ఉండే పాక్ తొలిసారి భారత సైనికుడిని ప్రశంసిస్తూ కరాచీ కేంద్రంగా నడిచే ‘‘ది డాన్’’పత్రిక ఓ కథనం రాసింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ అదుపులో ఉన్న మిగ్-21 యుద్ధ విమాన పైలట్ ‘అభినందన్ సింగ్’పై ఆ వార్త పత్రిక ఓ కథనం రాసింది...ఆ వార్తలో శత్రుదేశానికి పట్టుబడతానని తెలిసి కూడా, ప్రాణాలు పోయే పరిస్ధితిలోనూ భయభ్రాంతులకు లోనుకాకుండా అతను కర్తవ్యం మరువలేదని పేర్కొంది. పాక్ లో ల్యాండ్ అయి అభినందన్ తెలివిగా వ్యవహరించి తన వద్ద ఉన్న కీలక డాక్యుమెంట్లను మాయం చేశాడని ప్రశంసించింది. మిగ్-21 విమానం కూలిపోవడంతో పారాచ్యూట్ సాయంతో అభినందన్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దిగాడు. అక్కడున్న కొందరు స్థానికుల్ని ఇది ఇండియానా, పాకిస్తానా అని అడిగాడు. దీంతో అక్కడున్న వారిలో ఒకరు తెలివిగా ఇది ఇండియా అని బదులిచ్చాడు. దీంతో అతను ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశాడు.‘‘ నా నడుము విరిగిపోయింది.. దాహంగా ఉంది.. మంచినీరు కావాలి’’ అని అడిగాడు. అయితే అక్కడున్న పాకిస్తానీయులు... భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయడతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అరిచారు. దీంతో తాను కాలు మోపింది ఎక్కడో అర్ధమైన అభినందన్ వెంటనే పిస్టల్ బయటకు తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. అయితే స్ధానికులు రాళ్లతో అతనిని తరుమారు.. నడుము విరిగిపోయినా అభినందన్ అరకిలోమీటరు దూరం పరిగెత్తాడు..అక్కడే ఉన్న కాలువలో దాక్కొని తన జేబులో ఉన్న కీలక పత్రాలను మింగేశాడు. మరికొన్నింటిని ముక్కలు ముక్కలు చేసి నీటిలో కలిపేశాడు. స్థానికులు వెంబడించి ఎట్టకేలకు సైన్యానికి అప్పగించారు. ‘‘అనంతరం మీ లక్ష్యం ఏంటని పాక్ సైనికులు అడిగిన ప్రశ్నకు... జవాడు చెప్పదలచుకోలేదని పేర్కొన్నారు’’. అయితే ఈ వార్త పత్రిక ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాలను మాత్రం అందులే రాయలేదు. దానికి బదులుగా పాకిస్తానీయులు ఏ పదం అయితే జీర్నించుకోలేరో...దేన్నీ అయితే పూర్తిగా విమర్శిస్తారో అనే నినాదాలు చేశాడు అని ప్రచిరించింది.

వార్తా పత్రిక : DAWN NEWS.COM