సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను నిలిపిన పాకిస్తాన్

SMTV Desk 2019-02-28 17:09:11  IAF strike, Samjhauta Express stopped by Pakistan, Attari railway station

ఇస్లామాబాద్‌, ఫిబ్రవరి 28: ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను పాకిస్థాన్ నిలిపివేసింది. పాక్ భూభాగంలోని లాహోర్ లో ఈ రైలును నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని పాక్‌కు చెందిన మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో పాక్‌ నుంచి అటారీకి రావల్సిన భారత ప్రయాణికులు పాక్‌ నిర్ణయంతో లాహోర్‌ రైల్వే స్టేషన్‌లోనే నిలిచిపోయారు. ఐతే భారత ప్రయాణికులను ఇతర మార్గాల ద్వారా వాఘా సరిహద్దుకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని భారత అధికారులు వెల్లడించారు. మరోవైపు పాక్‌ నిర్ణయంతో బుధవారం ఢిల్లీ నుంచి ప్రారంభమైన రైలు అటారి వద్ద భారత రైలు నిలిచిపోయింది.