అమరులైన జవాన్లకు లతా మంగేష్కర్ విరాళం

SMTV Desk 2019-02-28 15:37:25  Lata Mangeshkar, Donation, Soldiers, Pulwama Attack

ముంబై, ఫిబ్రవరి 28: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్లకు పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు విరాళాలు అందించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ సింగర్ లతా మంగేష్కర్ కూడా ఈ జాబితాలో చేరారు. తన మంచి మనసును చాటుకున్న ఆమె, మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో దేశ ప్రజలంతా మంగేష్కర్ ను ప్రశంసిస్తున్నారు. తన తండ్రి దీనానాథ్ మంగేష్కర్ గారి వర్థంతి సందర్బంగా ఆమె ఈ విరాళంను అందిస్తున్నట్లు చెప్పారు.

ఈ సహాయంతో మీపై మరింత గౌరవం పెరిగింది మేడమ్ అంటూ మీరు చేసిన సహాయం ఎంతో అమూల్యమైనదని పలువురు నెటిజన్లు పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు కూడా వారికి తోచినంత ఆర్థికసహాయాన్ని ప్రకటించారు.