పాకిస్థాన్ పై సర్జికల్ దాడుల్లో హైదరాబాద్ పాత్ర

SMTV Desk 2019-02-27 17:02:12  pakistan, surgical strike, pakistan terrorists

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత్ వాయుసేన చావుదెబ్బ తీసిన సంగతి తెలిసిందే. పాక్ లోని బాలాకోట్ లో చేసిన సర్జికల్ దాడిలో 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ సర్జికల్ దాడుల్లో పాల్గొన్న పైలెట్లు అందరూ హైదరాబాద్ లో శిక్షణ తీసుకున్నవారేనని తేలింది. ఈ పైలెట్లు అందరూ హైదరాబాద్ లోని హకీంపేటలో ఉన్న దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ పొందారని ఓ సీనియర్ ఐఏఎఫ్ అధికారి తెలిపారు.

ఐఏఎఫ్ లో చేరే పైలెట్లకు తొలుత బేసిక్, ఆ తర్వాత అప్లయిడ్ ట్రైనింగ్ ను దుండిగల్ అకాడమీలోనే అందిస్తారని వెల్లడించారు. అనంతరం ఆపరేషనల్ ట్రైనింగ్ ను పఠాన్ కోట్, ఆదంపూర్ ఎయిర్ బేస్ లలో ఇస్తారని పేర్కొన్నారు.

ఈ పైలెట్లకు తొలుత 6 నెలల పాటు ఫ్రీ-ఫ్లయింగ్ శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం మాడ్యులేటర్ ద్వారా విమానం నడపడంలో మెలకువలు నేర్చుకుంటారని అన్నారు. 7 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అకాడమీ నుంచి వందలాది మంది యువతీయువకులు శిక్షణ పొందారు.