ఢిల్లీ చేరుకున్న బాబు, పలు విషయాలపై చర్చలు

SMTV Desk 2019-02-27 16:42:18  Chandrababu Naidu, Delhi Tour, Parliament Meeting, Pulwama Attack, Alliance

అమరావతి, ఫిబ్రవరి 27: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళ్లారు. అమరావతి నుంచి గన్నవరానికి హెలికాప్టర్ ద్వారా వచ్చిన సీఎం అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్ లో జరిగే విపక్ష నేతల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్ళారని సమాచారం. అలాగే, ఈ భేటిలో పుల్వామా ఉగ్రదాడి, పాక్ భూభాగంపై వాయుసేన దాడులపై నేతలు చర్చించనున్నారు. వీటిపై ఎలా స్పందించాలనే విషయంపై సమాలోచనలు చేయనున్నారు. దీంతోపాటు మహాకూటమి, ఈవీఎంలపై కూడా చర్చించబోతున్నారు. మరోవైపు, త్వరలో అమరావతిలో నిర్వహించనున్న ధర్మపోరాట దీక్షపై కూడా నేతలు చర్చించనున్నారు.