వీర జవాన్లకు 'ఢీ జోడి' నివాళి

SMTV Desk 2019-02-27 13:25:47  Dhee jodi, E TV , Reality Show, Tribute To Soldiers

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఈటీవీలో పాపులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ జోడి , పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది వీర జవాన్లకు నివాళులు అర్పించింది. భారత దేశ సైనికులకు ఒక స్పెషల్ పాటను అంకితం చేస్తూ ప్రోమోను విడుదల చేసారు.

సరిహద్దుల్లో ఉన్న తండ్రికి ఎక్కడో తన ఇంట్లో ఉన్న కూతురుకి మధ్య సంభాషణను,ఆ తర్వాత దాడిలో కోల్పోయిన 40 మంది సైనికుల చిత్రాలు చూపించి చక్కని భావోద్వేగాలతో డాన్స్ రూపంలో కృష్ణ మాస్టర్ కొరియోగ్రఫీతో చూపించి ఆయన దేశ భక్తిని చాటుకోగా ఆయన కంటెస్టెంట్స్ సుభాష్ మరియు మాన్షిలు దానికి ప్రాణం పోసి ఆ స్పెషల్ పాటకి అద్భుతంగా డాన్స్ చేసి జవాన్లకు అంకితం చేసారు.

ఇప్పటి వరకు ఢీ ప్రోగ్రాం వారు ఎన్నో సందేశాలను డాన్స్ రూపంలో తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ ఎపిసోడ్ మార్చి 6వ తేదీన బుధవారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీ ఛానెల్లో ప్రసారం కానుంది.