సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేసిన పాక్...ఇది దేనికి సంకేతం..?

SMTV Desk 2019-02-27 10:01:28  Pakistan, India, Surgical Strike, siren

పాకిస్తాన్, ఫిబ్రవరి 27: నిన్న పాకిస్తాన్ పై భారత్ చేసిన వైమానిక దాడులతో రెండు దేశాల సరిహద్దులలో యుద్ధ వాతావరణం నెలకొంది. చాలా సంవత్సరాలుగా ఉపయోగించని సివిలియన్ డిఫెన్స్ సైరన్ లను పాకిస్థాన్ నేడు మోగించింది. యుద్ధం జరుగుతున్న వేళ శత్రు దేశపు విమానాలు బాంబులతో వస్తుంటే వీటిని మోగించి, ప్రజలను అప్రమత్తం చేస్తారు. నిన్నటి సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోగా, ఈ ఉదయం ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో సైరన్ లను పాకిస్థాన్ మోగించింది.

అకస్మాత్తుగా సైరన్లు మోగడంతో ప్రజలు భయబ్రాంతులకు గురై ఉరుకులు, పరుగులు పెట్టారు. ఈ సైరన్ లు ఉదయం నుంచి నిరాటంకంగా మోగుతున్నాయి. భారత్ పై దాడికి దిగాలన్న ఆలోచనలో ఉన్న పాక్, తమ పౌరులను అప్రమత్తం చేస్తోందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. నిన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, ఏం జరిగినా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే పాక్ మోగించిన ఈ సైరన్లు దేనికి సంకేతమో తెలియాల్సి ఉంది.