భారత సరిహద్దుల్లో మళ్లీ భీకర కాల్పులు

SMTV Desk 2019-02-26 19:45:18  Pakistan, LOC,

భారత్ సర్జికల్ స్ట్రైక్-2.. 24 గంటలు కాకముందే పాకిస్తాన్ తిరగబడింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మళ్లీ ఉల్లంఘించింది. ఈ నేపథ్యం లో భారత సరిహద్దుల్లో మళ్లీ కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్ లోని పూంచ్, అఖ్నూర్, నౌషెరా సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో పాకిస్థాన్ సైనికులు కాల్పులకు దిగారు. అయితే, ఈ కాల్పులకు భారత జవాన్లు దీటుగా స్పందించారు. ఈ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పాకిస్థాన్ నాలుగు సార్లు కాల్పులకు పాల్పడింది.