న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: టీం ఇండియా జట్టు సారథి విరాట్ కోహ్లీ మరోసారి తన అభిమానుల పట్ల ప్రేమను చాటుకున్నాడు. అభిమానులతో పాటు జట్టు సహచరులపైనా తనతో పాటు పని చేసే సిబ్బందిపైన ప్రత్యేక శ్రద్ధ కనబరిచే కోహ్లీ తనకు సెక్యూరిటీ పర్సనల్గా వ్యవహరించే ఫైజల్ బర్త్ డేను దగ్గరుండి జరిపించాడు. కేక్ కట్ చేయించి బహుమతిని అందించాడు. కాగా ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అభిమానులపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీపై ఆస్ట్రేలియాతో టీ20 ఫార్మాట్ కు ముందు జరిగిన వేడుకల్లో కోహ్లీతో పాటు మరి కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం టీ20 మ్యాచ్ జరగనున్న క్రమంలో కోహ్లీసేన ఇప్పటికే బెంగళూరు చేరుకుని ప్రాక్టీసు చేస్తోంది. మరి కొద్ది రోజుల్లో వరల్డ్ కప్ జరగనుండటంతో ఇప్పటికే జట్టును అన్ని విభాగాల్లో సిద్ధం చేసుకున్నాడు కోహ్లీ. తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన టీమిండియా అందుకోగా రెండో టీ20 గెలిచి టైగా ముగించాలని భారత్ భావిస్తోంది.