బెంగళూరు, ఫిబ్రవరి 26: ఆదివారం ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో కోహ్లీ సేన చివరి బంతి వరకు పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. బుదవారం బెంగుళూరు వేదికగా ఈ జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. రెండో టీ20లో గెలిచి సిరీస్ను సమం చేయాలని కోహ్లీసేన తహతహలాడుతోంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భారత్ 0-1తో వెనుకబడి ఉంది. సిరీస్ను సమం చేయాలంటే భారత్ ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే. చిన్నస్వామి స్టేడియంలో టీమ్ఇండియా ఇవాళ ప్రాక్టీస్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ల్లో కోచ్, సహాయ సిబ్బంది పర్యవేక్షణలో సాధన చేశారు. తుది జట్టులో ఏమైనా మార్పులు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రెండో టీ20 బుధవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
టీం ఇండియా జట్టు : Rohit Sharma, KL Rahul, Virat Kohli (c) , Rishabh Pant, MS Dhoni, Dinesh Karthik, Ravindra Jadeja, Mayank Marakande Yuzvendra Chahal, Jasprit Bumrah, Siddarth Kaul.
ఆస్ట్రేలియా జట్టు : Aaron Finch (c) , D’Arcy Short, Peter Handscomb, Glenn Maxwell, Marcus Stoinis, Ashton Turner, Jhye Richardson, Pat Cummins, Adam Zampa, Nathan Coulter-Nile, Jason Behrendorff.