దేశం సంబరాలు చేసుకోవాల్సిన రోజు ఇదీ : మోదీ

SMTV Desk 2019-02-26 16:47:57  Pulwama attack, Indian airforce, Pakistan terrorists surgical strike, Indian army, Narendra modi

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: మంగళవారం తెల్లవారుజామున భారత విమాన దళాలు పాక్ ఉగ్రావాదుల పై జరిపిన సర్జికల్ స్ట్రైక్ దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ రోజు సంబరాలు చేసుకోవాల్సిన రోజని మోదీ అన్నారు. ఢిల్లీలో అత్యున్న స్థాయి సమావేశం తర్వాత ప్రధాని నరేంద్రమోడీ రాజస్థాన్‌లోని చురులో జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మోడీ వేదిక వద్దకు రాగానే ప్రజలు పెద్ద ఎత్తున ‘‘ భారత్‌ మాతా కీ జై’’ అంటూ నినాదాలు చేశారు. దేశం సంబరాలు చేసుకోవాల్సిన రోజు ఇదంటూ ఈ సభ వేదిక నుండి మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. సైనిక సంక్షేమానికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకొన్నామని మోడీ చెప్పారు.