మిస్టర్ కూల్ కి మద్దతు తెలిపిన గ్లెన్ మ్యాక్స్‌వెల్

SMTV Desk 2019-02-26 15:59:25  Maxwell, India, MS Dhoni

వైజాగ్, ఫిబ్రవరి 26: మొన్న జరిగిన ఆస్ట్రేలియా - భారత్ టీ20 మ్యాచ్ లో ఇండియా ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడం కి ముఖ్య కారణం మహేంద్ర సింగ్ ధోని అని ఇంకొందరు ఉమేష్ యాదవ్ అని ట్రోల్ చేస్తున్నారు అయితే ఈ నేపథ్యం లో ఆస్ట్రేలియా భీకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ధోనికి మద్దతు పలికాడు


తక్కువ ఎత్తులో బంతులు వస్తున్న విశాఖ పిచ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని లాంటి ఆటగాళ్లకు కూడా పరుగులు సాధించడం కష్టమేనని గ్లెన్ మ్యాక్స్‌వెల్ అభిప్రాయపడ్డాడు.ఈ పిచ్‌పై ధోని స్ట్రైక్‌రేట్‌ సరైనదే. వికెట్‌ అలా ఉన్నప్పుడు ఏ బ్యాట్స్‌మన్‌కైనా పరుగులు చేయడం కష్టమే అని అన్నాడు.

"అవతలి వైపు చాహల్‌ను ఉంచుకొని ఒక్కడే పవర్‌ హిట్టింగ్‌ చేయలేడు. ధోని ప్రపంచ స్థాయి ఫినిషర్‌. అతడూ బంతిని బాదేందుకు ఇబ్బంది పడ్డాడు. అలాంటప్పుడు మెల్లగా ఆడటంలో తప్పులేదు. ఆఖరి ఓవర్‌లో అతడు సిక్సర్‌ బాదడం చూస్తుంటే ఎంత కష్టంగా ఆడుతున్నాడో తెలుస్తుంది" అని మ్యాక్స్ వెల్ చెప్పుకొచ్చాడు. భారత ఇన్నింగ్స్‌లో చివరి వరకు నౌటౌట్‌గా నిలిచిన ధోని 37 బంతుల్లో 29 పరుగులే చేసిన సంగతి తెలిసిందే.