హైదరాబాద్, ఫిబ్రవరి 26: కింగ్ నాగార్జున ప్రస్తుతం మన్మధుడు సినిమా సీక్వెల్ లో నటిస్తున్నాడు. చిలసౌ చిత్రంతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు 2 తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న దానిపై ఎన్నో వార్తలు వినిపించాయి. మొదట అనుష్క, పాయల్ రాజపుత్ ఈ సినిమాలో హీరొయిన్లుగా నటిస్తున్నారని మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలు నిజం కాదని తేలిపోయింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేసారు. తొలిసారి రకుల్ నాగార్జునతో జోడీ కట్టనుంది.
ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నాడు. నాగార్జున సొంతంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. మార్చి 12న చిత్రం అఫీషియల్గా లాంచ్ కానుంది. తొలి షెడ్యూల్ పోర్చుగల్లో జరగనుంది. ఎక్కువ శాతం చిత్రీకరణ యూరప్లో జరపనున్నారని తెలుస్తుంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ మన్మథుడు 2 చిత్రానికి సంగీతం అందించనున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.