హైదరాబాద్, ఆగష్టు 3 : లీడర్ సినిమాతో వెండి తెరకు పరిచయమై నేటి బాహుబలి సినిమా వరకు ఎన్నో జయాపజయాలను ఎదుర్కొన్న దగ్గుపాటి రానా, తాను విక్టరీ వెంకటేష్ అభిమానులు ఉన్నారన్న దైర్యంతోనే సినిమా రంగంలోకి వచ్చానని, వారి అండతోనే హాలీవుడ్ సినిమాను సైతం హైదరాబాద్ లో చేస్తానన్నారు. తాజాగా రానా నటించిన "నేనే రాజు నేనే మంత్రి" సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ సినిమా గురించి మాట్లాడుతూ తన తండ్రి సురేష్ బాబు ప్రొడక్షన్ లో చేస్తున్న మొదటి సినిమా అని, అందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా తానూ ఈ స్థాయిలో ఉండడానికి తన తాత రామానాయుడే కారణమని, ఆయన లేని లోటు బాగా తెలుస్తుందని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ వేడుకలో అభిమానులు వినూత్నంగా విక్టరీ వెంకటేష్ భార్యా పిల్లల చేతుల మీదుగా ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేయించడం విశేషం.