దెబ్బకు దెబ్బ... 300 మంది ఉగ్రవాదులను హతం చేసిన భారత్

SMTV Desk 2019-02-26 12:07:48  Terror, Surgical Strike, Pakistan, India

జమ్మూ కాశ్మీర్, ఫిబ్రవరి 26: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో భారత్ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను భారత్ కోలుకోలేని దెబ్బకొట్టింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అందరూ నిద్రిస్తున్న వేళ, చడీ చప్పుడు కాకుండా వెళ్లిన భారత యుద్ధ విమానాలు జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ లో సుమారు 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రధాన పట్టణాలైన బాలాకోట్, ముజఫరాబాద్ శివార్లలో ఉన్న శిబిరాల్లోని 3 కంట్రోల్ యూనిట్లపై 200కు పైగా బాంబులను జారవిడిచిన వాయుసేన విమానాలు, ఆ ప్రాంతాన్ని తునాతునకలు చేసి వచ్చాయి. ఈ దాడిపై స్పందించిన పాకిస్థాన్, భారత యుద్ధ విమానాలు వాస్తవాధీన రేఖను దాటి వచ్చాయని, దీన్ని గమనించిన తమ ఫైటల్ జెట్స్ వాటిని తరిమేశాయని ప్రకటించింది.