ఒక్క సైగతో అంత మౌనం

SMTV Desk 2019-02-26 11:57:10  Virat Kohli, Tribute, Soldiers, Stadium

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి దేశభక్తిని చాటుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు టీ20 మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లు నివాళులర్పించారు. ఆ సమయంలోనే స్టేడియంలో కిక్కిరిసిన అభిమానులను ఒక్క సైగ చేయడం ద్వారా కోహ్లీ అమర జవాన్ల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.

భారత్, ఆస్ట్రేలియా జట్లు మధ్య ఆదివారం టీ20 సీరిస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం స్టేడియంలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ కు ముందు భారత ఆటగాళ్లు పుల్వామా సైనికుల మృతికి నివాళుల్పించారు. భారత ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి మైదానంలో అడుగుపెట్టారు. జాతీయ గీతాలాపన పూర్తికాగానే అమర సైనికులను ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని అభిమానులందరు కూడా నిలబడి మౌనం పాటించారు. అయితే ఈ సమయంలో కొందరు అభిమానులు మాత్రం అత్యుత్సాహంతో భారత్ మాతాకి జై అంటూ నినదించడం ప్రారంభించారు. దీంతో కాస్త అసహనానికి గురైన కోహ్లీ ఆ నినాదాలు చేస్తున్నవారికి మౌనంగా వుండాలంటూ సైగ చేశాడు.