200 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అంచనా

SMTV Desk 2019-02-26 11:52:43  Bharath, Revenge, Pakisthan, 200 Members, Terrorist

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిపై భారత్ ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా అని చూస్తుండగా, ఈరోజు తెల్లవారు జామున ఆ ప్రతీకారం తీర్చుకొనే సమయం వచ్చింది. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ శిబిరాలపై ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. 12 మిరాజ్ యుద్ధ విమానాలు, పీవోకేలోకి దూసుకెళ్లి ఉగ్రవాద క్యాంపులపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో బాలాకోట్ కేంద్రంగా ఉన్న జైషే శిబిరాలు ధ్వంసమైనట్లు సమాచారం. ఈ దాడిలో దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతమైఉంటారని భావిస్తున్నారు. మరోవైపు భారత యుద్ధ విమానాలు ఎల్‌ఓసీ దాటినట్లు పాకిస్తాన్ ప్రకటించింది.